తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 28 2024, 12:20

మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హరిబాబు నియామకం

మంథని బార్ అసోసియే షన్ అధ్యక్షుడిగా బుధ వారం కెవిఎల్ఎన్ హరి బాబు ఈ ఎన్నికతో పదవసారి ఎన్నికయ్యారు.

మంథని బార్ అసోసియే షన్ ప్రధాన కార్యదర్శిగా ముస్కుల సహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రఘోతం రెడ్డి, సహాయ కార్యదర్శిగా విజయ్ కుమార్, కోశాధి కారిగా అంజనేయులు, లైబ్రరీ కార్యదర్శిగా ఆర్ల నాగరాజు, సాంస్కృతిక కార్యదర్శిగా కటకం శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 28 2024, 11:28

రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య

బాసర రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య కలకలం లేపింది.బుధవారం రాత్రి నాగర్సోల్ నుండి నర్సాపూర్ వెళ్లే ట్రైన్ కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కు పాల్పడింది.

మృతురాలు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన యువతిగా గుర్తించారు. నిషిత డిగ్రీ కాలేజీలు చదువుతున్నట్లు ఐడి కార్డు ద్వారా తెలుస్తోంది.

మృతుడి వివరాలు తెలియ రావడం లేదు. రైల్వే పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొ ని మృతదేహాలను స్వాధీ నం చేసుకొని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 18 2024, 10:44

ప్రధాని మోడీపై ఈసీ కి ఎంపీ ఫిర్యాదు

ప్రధాని నరేంద్ర మోడీపై ఎన్నికల సంఘానికి TMC రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే సోమవారం ఫిర్యాదు చేశారు.

రాజకీయ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎయిర్‌ ఫోర్స్ హెలికాప్టర్‌ను ఉప యోగించి, ఎన్నికల నియ మావళిని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.

ప్రధాని మోదీపై తాను చేసిన ఫిర్యాదు కాపీని గోఖలే సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ కారణంగానే 1975లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అనర్హులుగా ప్రకటించినట్లు గుర్తు చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 18 2024, 10:42

రెండో రోజు కవితను విచారించనున్న ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచారించనుంది.

నేడు విచారణకు రావాల్సిం దిగా కవిత భర్త అనిల్‌తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బం దిలో ముగ్గురికి ఈడీ నోటీ సులు ఇచ్చింది.

సీజ్ చేసిన ఫోన్లను ఓపెన్ చేయడంతో పాటు మద్యం పాలసీకి సంబంధించిన పలు అంశాలపై వారిని ప్రశ్నించనున్నట్లు సమా చారం.

కాగా కవిత అరెస్టును సవాల్‌ చేస్తూ ఇవాళ ఆమె భర్త అనిల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 18 2024, 10:40

నేడు జగిత్యాలలో విజయ సంకల్ప సభ: హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

తెలంగాణ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ నేడు జగిత్యాలలో జరగనున్న విజయ సంకల్ప సభకు హాజరు కానున్నారు. జగిత్యాలలోని గీతా విద్యా లయ గ్రౌండ్‌లో ఈ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్త య్యాయి.

ఉదయం 11.15 గంటలకు జగిత్యాలకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సభలో మోడీ పాల్గొననున్నారు.

సభ అనంతరం హైదరా బాద్ చేరుకుని మోడీ ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ సభ సందర్భంగా బందోబస్తుకు 1600 మందిని పోలీసులు మోహరించారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 15 2024, 08:25

ముఖ్యమంత్రి నుదిటి పై గాయం :ఆస్పత్రికి తరలింపు

పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ గురువారం సాయంత్రం ప్రమాదానికి గురయ్యారు. ఆమె నుదిటిపై తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో ముఖ్యమంత్రిని హుటాహుటిన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా తెలిపింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. ఆమె నుదుటిపై గాటు పడగా, ముఖంపై రక్తం కారుతున్న దృశ్యా లను ఆ ఫొటోలో కనిపించాయి.

మమత ఇంట్లో గాయపడ్డా రని తెలుస్తోంది. వెంటనే కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మమతా బెనర్జీకి పెద్ద గాయమైందని.. ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు టీఎంసీ ఎక్స్‌లో పేర్కొంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 15 2024, 07:56

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో స్పల్ప భూప్రకంపనలు

ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో స్పల్పంగా భూప్రకంపనలు సంభవించాయి.

నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, ఓజిలి, దొరవారిసత్రం, పెళ్లకూరు మండలాలలో స్వల్పంగా భూప్రకంపనలు చోటుచే సుకున్నాయి

తిరుపతి జిల్లాలోని దొరవారిసత్రంలో భూమి కంపించింది. రెండు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.

దీంతో ప్రజలు భయాం దోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఈ భూప్రకంపనలపై ఆరా తీస్తున్నారు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 15 2024, 07:54

సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫి కేషన్‌ విడుదలైంది.

వీటిలో ఈఅండ్‌ఎం మేనేజ్‌ మెంట్‌ ట్రైనీ ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌ లో 42, మేనేజ్‌ మెంట్‌ ట్రైనీ సిస్టమ్స్‌,లో 07, జూనియర్‌ మైనింగ్‌ ఇంజినీర్‌ ట్రైర్‌ గ్రేడ్‌ సీ – 100, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ గ్రేడ్‌ సీ – 24, ఫిట్టర్‌ ట్రైనీ కేటగిరీ -1లో 47, సింగరేణిలో ఎలక్ట్రిషియన్‌ ట్రైనీ కేటగిరీ – 98 పోస్టులు ఉన్నాయి.

ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్‌ 15 నుంచి మే 4వ తేదీ లోపు http://www. scclmines.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సంస్థ సూచించింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 14 2024, 18:47

గ్రూప్‌ - 1 దరఖాస్తుల గడువు పొడిగింపు

TS PSC కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 దరఖాస్తుల గడువును మరో రెండు రోజులు పొడిగిం చింది.

షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టితో గడువు ముగియనుండగా ఈ గడువును పెంచింది. కాగా ఇప్పటివరకు 2.7లక్ష లకు పైగా దరఖాస్తులు వచ్చాయి.

అయితే గతంతో పోలిస్తే ఈసారి అప్లికేషన్ల సంఖ్య భారీగా తగ్గడం గమనార్హం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 14 2024, 17:43

డీఎస్సీ విద్యార్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

డీఎస్సీలో భాగంగా ఎస్జీటీ ఉచిత శిక్షణ, స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందించే ఉచిత శిక్షణకు దరఖాస్తు లను మార్చి 22 వరకు సమర్పించాలని కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ సంచాల కులు డాక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉమ్మడి కరీంనగర్, జగి త్యాల, పెద్దపల్లి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఈరోజు నుంచి మార్చి 22 వరకు www. tsbcstudycircle. cgg. gov. in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు...